టెస్ట్ అరంగేట్రంలోనే అర్ద సెంచరీ సాధించిన “యశస్వి జైస్వాల్”…

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య డొమినికా వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో రోహిత్ సేన పట్టు బిగుస్తోంది. నిన్న జరిగిన మొదటి రోజులో ఇండియా వెస్ట్ ఇండీస్ ను కేవలం 150 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. అశ్విన్ 5 వికెట్లతో రాణించి విండీస్ ను దెబ్బ తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన రోహిత్ శర్మ మరియు మొదటి టెస్ట్ ను ఆడుతున్న యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు. ఇప్పటికి చూస్తే ఇద్దరూ అర్ద సెంచరీ లను పూర్తి చేసుకుని ఇండియాను పటిష్టమైన స్థితిలో నిలపడానికి శ్రమిస్తున్నారు. కాగా నిన్ననే తన మొదటి టెస్ట్ కు భీజం పడింది యశస్వి జైస్వాల్ కు, చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతూ ఎటువంటి బెరుకు లేకుండా విండీస్ బౌలర్లను సమర్ధవంతమగా ఎదుర్కొంటున్నాడు.

ఇతను కెరీర్ లో మొదటి అర్ద సెంచరీ ని సాధించి సెలెక్టర్ లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కాగా ప్రస్తుతానికి ఇండియా 120 పరుగులు చేసి వికెట్ కోల్పోకుండా ఆడుతోంది. రోహిత్ 51 పరుగులతో మరియు జైస్వాల్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news