కోర్ట్ లో లొంగిపోయిన వైఎస్ భాస్కర్ రెడ్డి !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి తాజాగా కోర్ట్ లో లొంగిపోయిన విషయం తెలిసిందే. అంతకు ముందు భాస్కర్ రెడ్డి కి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కండిషనర్ బెయిల్ ను ఇచ్చింది సీబీఐ కోర్ట్. కానీ సీబీఐ కోర్ట్ కూడా బెయిల్ కోసం అడగగానే పిటీషన్ ను కొట్టేసినా ఆ తర్వాత జారీ చేసింది. ఇప్పుడు ఆ బెయిలు గడువు కాస్త నిన్నటితో ముగియడంతో వైఎస్ భాస్కర్ రెడ్డి వచ్చి కోర్ట్ లో లొంగిపోవడం జరిగింది. అనంతరం భాస్కర్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించడం జరిగింది. ఇక ఈ కేసులో సిబిఐ స్పష్టంగా ఇదే జరిగిందని తేల్చిచెప్పలేకపోతున్నారు.

కాగా ఇందులో ప్రమేయం ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిచిన సిబిఐ ఎందుకో వెనక్కి తగ్గినట్లుగా కొందరు అప్పట్లో కామెంట్లు చేశారు. మరి ఈ కేసు ఎప్పుడు సాల్వ్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news