KCR ను ఓడించడానికి ప్రజలు నిర్ణయం తీసేసుకున్నారు: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చే సమయం ఆసన్నమైనట్లే ఉంది. నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ రాష్ట్రమంతా ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పడంతో కాంగ్రెస్ నాయకత్వంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ విషయం పై తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని కట్టబెడితే గత రెండు పర్యాయాలుగా కేసీఆర్ సర్కారు మోసం చేస్తూ వచ్చిందని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంటాయని ముందుగా అనుకున్నామో అదే విధంగా జరిగాయని.. రేపు ఫలితాలు కూడా అలాగే వస్తాయని పూర్తి నమ్మకంతో రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనతో నిరాశతో ఉన్న ప్రజలు ఓడించడానికి ఫిక్స్ అయ్యిపోయారని రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఇక కేసీఆర్ డిసెంబర్ 3వ తేదీన రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ రేవంత్ ధీమాగా చెప్పడంతో ఇక కాంగ్రెస్ గెలవడంతో ఎంత నమ్మకంతో ఉన్నారో అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news