సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఇవాళ సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గమనార్హం. ఇరువురి మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల అంశంపైన కూడా చర్చించినట్లు సమాచారం.

 

అయితే ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి తన తనయుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక, వివాహానికి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. తాజాగా.. రెండు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభమైన వేళ వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

Read more RELATED
Recommended to you

Latest news