నేడు గవర్నర్ తమిళ సైని కలవనున్న వైఎస్ షర్మిల

-

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైని కలవనున్నారు తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు వైఎస్‌ షర్మిల.

తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ షర్మిల. ఇక ఇవాళ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను రేపటికి వాయిదా వేసుకున్నారు షర్మిల. మంగళవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర యథావిధంగా ప్రారంభం కానుంది.

ఇది ఇలా ఉండగా… అడగాల్సిన చోటుకు అలిగి పోకుంటే ఆగం అయితం దొరా.. ఎదురుపడలేక ఏతులు కొడితే.. కడుపెండుతది దొరా అంటూ కేసీఆర్‌ పై మండిపడ్డారు షర్మిల. తమరి మూర్ఖ రాజకీయాలకు.. తెలంగాణను తగలపెట్టకు. కుర్చి ఎట్లా కాపాడుకునుడో అని కుట్రలు చేసుడు మానేసి.. డిల్లీకి పో.. రాష్ట్రానికి రావల్సినదాని గురించి కొట్లాడని వార్నింగ్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news