KCR దిగి వచ్చే వరకు పచ్చి మంచి నీళ్లు ముట్టను – వైఎస్‌ షర్మిల

-

KCR దిగి వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వైఎస్‌ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ & బ్యాచ్ BRS సంబరాలు చేసుకోవచ్చు కానీ అదే రోజు YSR తెలంగాణ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేస్తే మాత్రం అరెస్టులు… నిర్బంధాలు అని ఆగ్రహించారు. నియంత కేసీఆర్ ఎందుకు ఈ కర్ఫ్యూ ? అని మండిపడ్డారు వైఎస్‌ షర్మిల.

మీరు, మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన కొట్లాడే YSR తెలంగాణ పార్టీని మాత్రం ప్రశాంతంగా నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వడు కేసీఆర్. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లు వేస్తున్నాడన్నారు.

హైకోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి ఉన్నా..కేసీఆర్ నియంత పాలనలో న్యాయస్థానానికి గౌరవం లేదు, ప్రజాస్వామ్యానికి విలువ లేదు. YSR తెలంగాణ పార్టీ శ్రేణులను విడుదల చేసేంత వరకు, పార్టీ శ్రేణులను ఆపే ఈ కర్ఫ్యూ ఎత్తేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టదని పేర్కొన్నారు వైయస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news