వివేకా హత్య కేసు ; సాక్షి ప్రతినిధి చుట్టు బిగిసుకున్న ఉచ్చు!

-

కడప : మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ అధికారులు… చాలా మందిని దర్యాప్తు చేస్తున్నారు.  అయితే… తాజాగా మరో సారి తెరపైకి వచ్చింది వైఎస్ వివేకా గుండె పోటు చిత్రీకరణ వ్యవహారం. దీంతో వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో నాటి గుండె
పోటు చిత్రీకరణ వ్యవహారం పై ఆరా తీస్తోంది సీబిఐ బృందం.

వివేకా గుండెపోటు తో మృతి చెందినట్లు మొదట ఎలా ప్రసారం చేశారని సాక్షి ప్రతినిధిని ప్రశ్నించి నట్లు సమాచారం అందుతోంది. ఎంపి అవినాష్ రెడ్డి పిఏ లను కూడా గుండెపోటు వ్యవహారం పై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం అందుతోంది. మొత్తానికి కడప జిల్లా లో మరోమారు హాట్ టాఫిగ్గా మారింది వివేకా గుండె పోటు వ్యవహారం. ఇక ఇది ఇలా ఉండగా…ఈ కేసులో అరెస్ట్‌ అయిన సునీల్‌ కుటుంబాన్ని కూడా సీబీఐ అధికారులు ఇవాళ విచారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news