టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డికి ధర్మపురి అరవింద్ బంపర్‌ ఆఫర్

-

టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్ రెడ్డికి ధర్మపురి అరవింద్ బంపర్‌ ఆఫర్ ఇచ్చారు. ఎంపీ రంజిత్ రెడ్డి ఆపార్టీనీ విడి బిజెపిలో చేరితే మంచిదని సూచించారు. బీజేపీలో చేరితే… ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కోళ్ల ఫారాల కోసం మొక్క జొన్న దిగుమతి చేసుకోవడానికి అవకాశం కల్పించాలని రంజిత్ రెడ్డి కేంద్రాన్ని అడిగారని.. కానీ కేసీఅర్ రాష్ట్రంలోనే మొక్క జొన్న ఉత్పత్తి మిగులు నిల్వలు విపరీతంగా ఉన్నాయని చెపుతున్నాడని మండి పడ్డారు.

టిఆర్ఎస్ పార్టీలో ఎంపీలకు స్వేచ్చ లేదు కనీసం ..అపాయింట్మెంట్ కూడా ఎంపీలకు ఇవ్వడని ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడం ఇష్టం లేదని.. ఎన్ ఆర్ ఐల కోసం కేంద్ర ప్రభత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారన్నారు.  ఎన్ ఆర్ ఐల కోసం కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ 28 రోజులు కాగానే కోవిషిల్డ్ తీసుకునే అవకాశం ఇచ్చిందని.. కానీ తెలంగాణా రాష్ట్రంలో ఎన్ ఆర్ ఐ లకు వాక్సిన్ ఇవ్వటం లేదని నిప్పులు చెరిగారు. ఎన్ ఆర్ ఐ లకు వాక్సిన్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా పట్టించు కోవటం లేదని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news