హైకోర్టులో వైయస్ వివేకా హత్యకేసు విచారణ..హాజరైన సునీత

-

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై. సునీల్ యాదవ్(ఏ2), గజ్జల ఉమా శంకర్ రెడ్డి (ఏ3), దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి(ఏ5) బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.ఇప్పటికే నిందితుల తరపు వాదనలు పూర్తయ్యాయి.ఇవాళ సిబిఐ, వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.ఈ నేపథ్యంలో సునీత న్యాయస్థానానికి హాజరయ్యారు.ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ మీద ఉన్నారు.నిందితుల నుంచి వాంగ్మూలాన్ని సేకరించారని..వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అందువల్ల నిందితులకు బెయిల్ ఇవ్వాలని ఇప్పటికే కోర్టును కోరారు.గత సోమవారం శివ శంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ప్రారంభం కాగానే సునీత తరపు న్యాయవాది స్పందిస్తూ..తమ వాదనలు వినాలని అనుబంధ పిటిషన్( ఇంప్లీడ్) దాఖలు చేశామని తెలిపారు.మృతుడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు.గతంలో శివ శంకర్ రెడ్డి పిటిషన్ నుపిటిషన్ ను ఓ న్యాయమూర్తి కొట్టేశారు అని ప్రస్తుత వాణిజ్యం అక్కడికే విచారణ కు వెళ్లాలని కోర్టు దృష్టికి తెచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news