అబ్దుల్లాపూర్ మెంట్ జంట హత్యల్లో ట్విస్ట్…. భార్య కళ్లెదుటే ప్రియుడిని హింసించి చంపిన భర్త

-

అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా ఈ జంట హత్యలు జరిగాయని పోలీసులు తేల్చారు. వివాహిత జ్యోతి, ఆమె ప్రియుడు యశ్వంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో వీరిద్దరిని తుదముట్టించాడు భర్త  శ్రీనివాస్. మంగళవారం అబ్ధుల్లాపూర్ మెట్ బ్రిడ్జి దగ్గర జ్యోతి, యశ్వంత్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇద్దరిని తీవ్రంగా హింసించి చంపినట్లు తేలింది. యశ్వంత్ ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేసి హత్య చేశారు. జ్యోతి ముఖంపై బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతులు ఇద్దరు వారాసిగూడకు చెందిన వారే. జ్యోతికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గత కొన్నిరోజులుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. దీంతో భర్త శ్రీనివాస్ వీరిద్దరిని సుపారి గ్యాంగ్ తో కలిసి హత్య చేశాడు.

భర్త శ్రీనివాస్ సుపారీ ఇచ్చి వీరిద్దరిని హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. భార్య జ్యోతితో పాటు అతని ప్రియుడు యశ్వంత్ ను భర్త శ్రీనివాస్ హత్య చేశాడు. చంపేముందు యశ్వంత్ ను జ్యోతి కళ్లెదుటే తీవ్ర చిత్ర హింసలు పెట్టి దారుణంగా హత్య చేశాడు. చంపొద్దని బతిమిలాడిన భార్య జ్యోతిని కూడా భర్త శ్రీనివాస్ చంపేశాడు. ఆదివారం సాయంత్రం వారాసిగుడ నుండి యశ్వంత్ ను ఫాలో అయ్యాడు శ్రీనివాస్ రావు. యశ్వంత్, జ్యోతి నగ్నంగా ఉన్న సమయంలో అప్పటికే సుపారీ గ్యాంగ్ తో సిద్ధంగా ఉన్న జ్యోతి భర్త శ్రీనివాస్ రావు మరో నలుగురితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత…కాళ్ళ , వెళ్ళ పడి బతిమాలినా… జ్యోతి ని సైతం హత్య చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news