వైఎస్సార్‌ కంటి వెలుగు 10న ప్రారంభించనున్న సీఎం జగన్‌

-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కంటివెలుగు’ పథకాన్ని ఏపీ సర్కార్ కూడా అమలు చేయనుంద‌ని విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి. 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news