‘పచ్చ’ మందకు పైత్యం ముదిరిపోయింది : విజయసాయి

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. టీడీపీ పార్టీ, పచ్చ మీడియాపై ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. ‘పచ్చ’ మందకు పైత్యం బాగా ముదిరిపోయిందని నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. ”ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయిందంట… వరల్డ్ మ్యాప్ లోంచి ఏపీ అదృశ్యమైందంట! 5 కోట్ల మంది వీళ్లకు మనుషుల్లా కనిపించడం లేదా? అధికారం పోగొట్టుకుని పొర్లిపొర్లి ఏడుస్తున్నారు. మా బాబే సీఎం అని గ్రాండ్ గా ఒక సినిమా తీసుకుని మురిసిపోండి. వేరే మార్గం లేదు.” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

ఇక అంతకుముందు ట్వీట్‌ లో ”మా ఆయిల్ వాడితే అరచేతిలో కూడా వెంట్రుకలు వస్తాయంటూ బోగస్ ప్రచారం చేసుకునే Tv5 నాయుడి నూజెన్ హెయిర్ ఆయిల్ USలో అయితే $15 అంట! నిలువు దోపిడీలాంటి ఈ దందాను అక్కడికీ విస్తరించాడు నాయుడు. డబ్బు కోసం గడ్డి కరవడం కంటే ఘోరం కదా ఇది!” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news