వైవి సుబ్బారెడ్డి: పంచకర్ల రమేష్ బాబు రాజీనామా చేసి తొందరపడ్డాడు … నాతో చెప్పాల్సింది !

-

రెండు రోజుల నుండి విశాఖపట్నం వైసీపీ నాయకుడు పంచకర్ల రమేష్ బాబు అలక మీద ఉన్నారని వార్తలు వస్తున్న మాట తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయానికి ఆ అలక కాస్త రాజీనామాకు దారి తీసింది. ఈ రోజు వైసీపీని వీడిపోతున్నట్లు ఒక లెటర్ మీడియా ముఖంగా విడుదల చేశారు పంచకర్ల రమేష్ బాబు మరియు ఈ నెల వ తేదీన పవన్ కళ్యాణ్ సమాకాశంలో జనసేనలో చేరనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు, ఈయన మాట్లాడుతూ పంచకర్ల రమేష్ బాబు తొందరపాటు తనంతో రాజీనామా చేశాడని చెప్పడంతో పాటుగా, రమేష్ బాబు మంచి ఆలోచన కల్గిన నాయకుడంటూ మెచ్చుకున్నారు. ఇలాంటి నాయకుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నాడు సుబ్బారెడ్డి. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పి ఉంటే పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేసేవాడిని అంటూ మాట్లాడారు. ఒకవేళ సీఎం జగన్ ను కలవాలి అనుకున్నా.. నాతో చెప్పాల్సింది అంటూ కామెంట్ చేశారు.

పార్టీ పెట్టిన సమయం నుండి చాలా మంది మాతో ఉన్నారు, కొందరు వెళ్లిపోతున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఎప్పుడూ ప్రజల శ్రేయస్సును కోరుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news