విశాఖ వేదికగా జరిగే రెండో టెస్టుకు విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ

-

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే  రెండో టెస్టు  విశాఖపట్నం వేదికగా డాక్టర్ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 2 నుంచి 6 వరకూ రెండో టెస్టు జరగనుంది.

ఈ మ్యాచ్ కోసం ఇండియా, ఇంగ్లాండ్ ప్లేయర్స్ నేడు విశాఖపట్నం చేరుకోనున్నారు. రెండో టెస్టు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి తెలిపారు. ఈరోజు  స్టేడియంలో ఏర్పాట్లను ఏసీఏ ట్రెజరర్ ఎ.వి. చలంతో కలిసి  పరిశీలించారు. స్టేడియం లోపల, బయట చేపడుతున్న పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఐదు రోజులపాటు జరిగే మ్యాచ్‌కు 10 వేల మంది విద్యార్థులకు, 14,250 మంది క్లబ్ క్రీడాకారులకు ఉచిత ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఆయన  వెల్లడించారు.ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో టీమిండియాపై ఇంగ్లాండ్ గెలిచిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news