నువ్వుల దీపంలో లవంగం వేసి హారతి ఇస్తే ఈ రాశుల వారికి శుభం! మార్చి 27 రాశి ఫలాలు

-

మార్చి 27 బుధవారం- రోజువారి రాశిఫలాలు

27 march 2019 today rasi phalalu

మేషరాశి: అనుకూలమైన రోజు, బంధువుల రాక, ధనలాభం, శుభకార్యాల వల్ల ఖర్చు. మిత్రుల సహకారం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, అయ్యప్పస్వామికి పూజ చేసుకోండి.

వృషభరాశి: మంచి ఫలితాలు ఉంటాయి, ధనలాభం, కార్యజయం, ఇంట్లో చిన్నచిన్న అనారోగ్య సమస్యలు అధిగమిస్తారు.
పరిహారాలు: నువ్వుల దీపంలో లవంగం వేసి ఇష్టదేవతకు హారతి ఇవ్వండి మేలు జరుగుతుంది.

మిథునరాశి: మిశ్రమ ఫలితాలు, ధనలాభం, అనవసరంగా మాట పడుతారు, ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేసుకోండి.

కర్కాటకరాశి: వ్యతిరేక ఫలితాలు, ధననష్టం, ప్రయాణాల్లో ఇబ్బందులు, కార్యభంగం.
పరిహారాలు: ఉదయాన్నే ఆంజనేయస్వామి దేవాలయంలో తమలపాకులతో ఆకుపూజ చేయించుకోండి.

సింహరాశి: అనుకూలం. పనులు పూర్తి, స్త్రీలతో లాభం, ధనవ్యయం, కార్యలాభం.
పరిహారాలు: నువ్వుల దీపంలో లవంగం వేసి ఇంట్లో దేవుని గదిలో హారతిలాగా ఇవ్వండి దోషాలు పోతాయి.

కన్యారాశి: మిశ్రమ ఫలితాలు, మాటపట్టింపులు, విందులు, వృథా ఖర్చు, ఉద్యోగులకు అనుకూలం.
పరిహారాలు: అమ్మవారి దేవాలయంలో అర్చనలు, అష్టోతర పూజలు మంచి చేస్తాయి.

తులారాశి: మిశ్రమం. చికాకులు, కలహాలకు సూచన, స్త్రీ మాలకంగా కార్యజయం.
పరిహారాలు: నువ్వుల దీపంలో లవంగం వేసి దేవునికి హారతి ఇవ్వండి చెడు పోతుంది, మేలు జరుగుతుంది.

వృశ్చికరాశి: అనుకూలం- చిన్నచిన్న సమస్యలు వచ్చినా అధిగమిస్తారు, వాహనాలతో జాగ్రత్త, కీర్తి, వస్తులాభం.
పరిహారాలు: పసుపు పూలతో/మాలతో అమ్మవారికి అర్చన చేయండి.

ధనస్సురాశి: వ్యతిరేక ఫలితాలు, పనుల్లో చికాకులు, ధననష్టం, అధిక ఖర్చులు.
పరిహారాలు: నువ్వుల దీపంలో లవంగం వేసి దేవునికి హారతి ఇవ్వండి దోషాల తీవ్రత తగ్గుతుంది.

మకరరాశి: కొంత వ్యతిరేక ఫలితాలు, కార్యనష్టం, ధనానికి ఇబ్బందులు, ప్రయాణ సూచన.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణ, కొబ్బరికాయ కొట్టి అక్కడే పెట్టి ఇంటికి వెళ్లండి.

కుంభరాశి: సగం-సగం లాభం, నష్టం, పనుల్లో పురోగతి, ఆందోళన, కలహం.
పరిహారాలు: అమ్మవారి దేవాలయం /అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక అర్చన మంచిది.

మీనరాశి: అనుకూలమైన ఫలితాలు, బాకీలు వసూలు, బంధువులతో సఖ్యత, కుటుంబంలో సంతోషం, పనులు పూర్తి.
పరిహారాలు: అయ్యప్పదేవాయలంలో పూజ/గణపతి దేవాలయంలో పూజ చేయించుకోండి మేలు జరుగుతుంది.

నోట్: నువ్వుల నూనెతో దీపారాధన చేసి దానిలో లవంగం వేసి దేవునికి హారతి ఇవ్వండం అనేది చాలా అద్భుత తంత్రం. దీనివల్ల చాలామంది లబ్ది పొంది ఉన్నారు. ఉత్తర భారతంలో ఈ తంత్రం చాలా ప్రసిద్ధి. నమ్మకంతో ఆచరించండి తప్పక శుభం జరుగుతుంది. జై హనుమాన్.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news