గుడ్ న్యూస్.. మే 20 నుంచి ఐఫోన్ ఎస్ఈ 2020 అమ్మ‌కాలు..!

-

ఆపిల్ సంస్థ త‌న నూత‌న ఐఫోన్‌ను మే 20వ తేదీ నుంచి విక్ర‌యించ‌నుంది. గ‌త కొద్ది రోజుల కింద‌టే ఆపిల్‌.. ఐఫోన్ ఎస్ఈ 2020ని విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. ఎప్ప‌టిలా ఈవెంట్‌లో కాకుండా ఆపిల్ ఈ సారి ఈ ఫోన్‌ను సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్ప‌టికే ప‌లు దేశాల మార్కెట్ల‌లో అందుబాటులో ఉంది. కానీ భార‌త్‌లో లాక్‌డౌన్ కార‌ణంగా ఈ ఫోన్ అమ్మ‌కాల‌ను ఇంకా ప్రారంభించ‌లేదు. కానీ ప్ర‌స్తుతం ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తుండ‌డం.. ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు తిరిగి డెలివ‌రీల‌ను ప్రారంభించ‌డంతో.. ఇక ఆపిల్ కూడా త‌న ఐఫోన్ ఎస్ఈ 2020ని విక్ర‌యించేందుకు సిద్ధ‌మైంది.

apple to sell iphone se 2020 in india from may 20th

ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020 విక్ర‌యాలు మే 20వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానున్నాయి. రూ.42,500 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్‌ను అమ్మ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల‌తో రూ.3600 వ‌ర‌కు లిమిటెడ్ టైం క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.38,900 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇక ఈ ఫోన్‌లో ఆపిల్ ఎ13 బ‌యానిక్ ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌, 4.7 ఇంచుల డిస్‌ప్లే, ట‌చ్ ఐడీ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 12, 7 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్టీఈ, 1821 ఎంఏహెచ్ బ్యాట‌రీ.. త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news