శాంసంగ్‌ నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్.. రూ. 12 వేల లోపే అదిరిపోయే ఫీచర్స్‌ 

-

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం..శాంసంగ్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనుంది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా.. శాంసంగ్‌ గెలాక్సీ AO4s. శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇటీవలే ఈ ఫోన్‌ ఫీచర్లు కూడా లీకయ్యాయి. ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం, 3 జీబీ ర్యామ్ ఇందులో ఉన్నాయి. 6.5 అంగుళాల డిస్‌ప్లే కూడా అందించారు. ఇంకా ఫోన్‌ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ స్పెసిఫికేషన్లు (అంచనా)

ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు గీక్ బెంచ్‌ వెబ్‌సైట్లో చూడవచ్చు. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 152 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 585 పాయింట్లను సాధించింది.
ఇందులో వీ-ఆకారంలో నాచ్ ఉన్న 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03ఎస్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు రెండు 2 మెగాపిక్సెల్ షూటర్లు ఉన్నాయి.
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందించారు.
ఈ స్మార్ట్‌ ఫోన్‌ 0.91 సెంటీమీటర్లుగా ఉండనుంది.
మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంలపై ఈ ఫోన్ పనిచేయనుంది.
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఇందులో ఉంది.
ఈ ఫోన్ ధర రూ.10 నుంచి 12 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ ఇంకా అధికారింగా ప్రకటించలేదు. త్వరలోనే అధికారికంగా ఫీచర్స్‌ ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news