కాకినాడలో 15 ఏళ్ల బాలికపై హాస్టల్ కరస్పాండెంట్ అత్యాచారం

-

కాకినాడ నగరానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో చదువుకుంటుంది. హాస్టల్ కరస్పాండెంట్ కొత్తపల్లి విజయ్ కుమార్ బాలికపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చింది. బాలిక ముభావంగా ఉండడం, అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని గమనించిన తల్లి.. అసలు విషయం ఏమిటని ఆరా తీసింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు అందిన గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అరెస్టు చేసి నేరుగా కోర్టులో హాజరు పరిచారు. విచారణలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. కరోనా మందులు ఇస్తానంటూ కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడని, వాటిని వేసుకున్నాక మత్తుగా అనిపించిందని బాలిక పోలీసులకు వెల్లడించింది. వీరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు విజయ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news