కేంద్ర ప్రభుత్వం : ఇలా కాల్స్ చేస్తే రూ.10,000 జరిమానా!

-

సరి కొత్త రూల్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం కొత్త నిబంధనలను తీసుకు రాబోతోందని తెలుస్తోంది. పెస్కీ కాలర్లపై రూ.10 వేల జరిమానా విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

 కేంద్ర ప్రభుత్వం/ Central Government
కేంద్ర ప్రభుత్వం/ Central Government

మోదీ సర్కార్ ఈ కొత్త రూల్స్ తీసుకు రావడం జరుగుతోంది. దీంతో టెలికం సబ్‌స్క్రైబర్లకు ఈ పెస్కీ కాల్స్ బెడద ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. పెస్కీ కాలర్లపై రూ.10 వేల జరిమానా విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ప్రతిపాదించిందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇది టెలీ మార్కెటర్లు చేసే ప్రతి కాల్, ఎస్ఎంఎస్‌కు ఇది వర్తిస్తుంది. 50 ఉల్లంఘనల తర్వాతనే కఠిన రూల్స్ తీసుకు రావాలని కేంద్రం అనుకుంటోంది. ఇది ఇలా ఉంటే 0-10 వరకు ఉల్లంఘనలకు రూ.1000, 10-50 ఉల్లంఘనలకు రూ.5 వేలు, 50 ఉల్లంఘనల తర్వాత ప్రతి ఒక్క కాల్, ఎస్ఎంఎస్‌కు రూ.10 వేల జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది.

కానీ ప్రస్తుతం జరిమానా విధింపు స్లాబ్స్ భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం 0-100, 100-1000, 1000కి పైన అనే నిబంధనల ఉల్లంఘన స్లాబ్స్ ఉన్నాయి. అంటే మోదీ సర్కార్ ఈ స్లాబ్స్‌ను తగ్గించబోతోందని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా డాట్‌కు చెందిన డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్.. డివైజ్ స్థాయిలోనే ఉల్లంఘనలను గమనించడం జరిగింది. అనుమానిత నెంబర్లకు వెరిఫికేషన్ కోసం మెసేజ్లు పంపుతుంది. అయితే రి-వెరిఫికేషన్ పూర్తి చేసుకొని నెంబర్లు ఇక పని చేయవు.

అలాగే ఆ సిమ్ కార్డు ఉన్న ఐఎంఈఐ నెంబర్లపై కూడా నిఘా ఉంటుంది. ఒకవేళ కనుక ఇలా ఉల్లంఘనల మీద ఉల్లంఘనలకు పాల్పడితే టెలికం కనెక్షన్ 2 ఏళ్ల పాటు బ్లాక్ చేస్తారు అని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news