పోస్టాఫీస్‌లో డబ్బులు పెడుతున్నారా..? అయితే ఈ తప్పులు చెయ్యద్దు..!

-

మీ డబ్బులుని పోస్టాఫీస్‌లోపెడతారా..? టైమ్ డిపాజిట్‌ TD కలిగి వున్నారా..? అయితే మీకోసం కొన్ని ముఖ్యమైన విషయాలు. TD కలిగి ఉంటే మీరు డబ్బులు పెట్టిన తర్వాత స్కీమ్ గడువు ముగిసేంత వరకు అలానే ఉండాలి. డబ్బులు తీసుకోవడం కుదరదు. ఒకవేళ మీరు ముందుగానే డబ్బులు తీసుకుంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

indian post
indian post

ప్రస్తుతం పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. వడ్డీ డబ్బులు మూడు నెలలకు ఒకసారి మీ అకౌంట్‌కు జమవుతూ వస్తాయి అన్న సంగతి తెలిసిందే. ఏడాది, మూడేళ్లు. ఐదేళ్లు కాల పరిమితితో మీరు డబ్బులు దాచుకోవచ్చు. టర్మ్ ఎంచుకొని డబ్బులు పెడితే లాస్ట్ వరకు వెయిట్ చెయ్యాల్సి ఉంటుంది. లేదంటే 6 నెలల తర్వాత ముందుగానే డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే వడ్డీ రేటు తగ్గుతుంది.

ఏడాదిలోపు తీసుకుంటే 4 శాతం వడ్డీ రేటు వస్తుంది. ఏడాది తర్వాత అయితే వడ్డీ రేటు 2 శాతం తగ్గుతుంది. ఒక ఉదాహరణ కూడా చూద్దాం.. రూ.5 లక్షలు డిపాజిట్ చేసి.. ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకున్నారు. 6.7 శాతం వడ్డీ వస్తుంది. అంటే మీరు మెచ్యూరిటీ సమయంలో రూ.6,97,003 వరకు వస్తాయి. వడ్డీ రూపంలో రూ.1,97,000 పొందొచ్చు.

అదే మీరు మూడేళ్లలో తీసుకుంటే.. వడ్డీ రేటు తగ్గుంది. 3.5 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టీడీలపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. 5 ఏళ్ల వరకు ఉంటే 6.7శాతం వడ్డీ వస్తుంది. ఇప్పుడు మీరు మూడేళ్ల తర్వాత డబ్బులు తీసుకుంటే 5.5 శాతం వడ్డీ రేటులో 2 శాతం వడ్డీ తగ్గుతుంది. అంటే మీకు కేవలం రూ.5,55,102 వస్తాయి. అంటే దాదాపు రూ.లక్షన్నర లాస్ ఏ కదా.

Read more RELATED
Recommended to you

Latest news