బ్రేకింగ్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సీపీ సజ్జనార్

-

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ సి పి గా ఉన్న సజ్జనార్ ను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. సైబరాబాద్ సీపీ నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం … సజ్జనార్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

cp-sajjanar

మూడేళ్లకు పైగా సైబరాబాద్ సి పి గా పనిచేసిన సజ్జనార్… తాజాగా ఆ పదవి నుంచి బదిలీ అయ్యారు. ఇక అటు సైబరాబాద్ సిపి గా స్టీఫెన్ రవీంద్ర ను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే… వీరిని ఎందుకు బదిలీ చేసిందనే దాని పై ఇంకా క్లారిటి రాలేదు. కాగా… సైబరాబాద్ సీపీ గా సజ్జనార్… మంచి పేరు తెచ్చుకున్నారు. దిశ మరియు వరంగల్ యాసిడ్ కేసులలో నిందితులను ఎనకౌంటర్ చేసి సీపీ సజ్జనార్… దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించారు.

Read more RELATED
Recommended to you

Latest news