క‌రెంట్ బిల్లు ముందే క‌ట్టేవారికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

-

ప్రీ పెయిడ్‌ ఫోన్‌ బిల్లు తరహాలో ఇప్పుడు ప్రీ పెయిడ్‌ కరెంటు వచ్చింది. మీ ఫోన్‌లో ఎలా ప్రీపెయిడ్‌ చార్జ్‌ చేయించుకుంటారో.. అలాగే ముందుగా డబ్బులు చెల్లించి మీకు కావాల్సినంత కరెంటునే కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలకే ప్రీ పెయిడ్‌ మీటర్ల విధానం అమల్లో ఉండగా.. తాజాగా ఇళ్లకు కూడా అందుబాటులోకి తీసుకు రావాలని డిస్కమ్‌లు నిర్ణయించాయు. వీటిని పెట్టుకునేందుకు వినియోగదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వారికి విద్యుత్తు చార్జీల్లో యూనిట్‌కు రూ.0.10 దాకా రాయితీ ఇవ్వాలని యోచిస్తున్నాయి.

ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో ఈ ప్రతిపాదనను చేర్చాయి. ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ ప్రీపెయిడ్‌ మీటర్‌కు రూ.8 వేలు అవుతుండగా.. త్రీ ఫేజ్‌ మీటర్‌కు రూ.12 వేలు అవుతుంది. ఈనెల రెండో వారంలో ట్రాన్స్‌కో సీఎండీ దే వులపల్లి ప్రభాకర్‌ రావు విదేశీ పర్యటన ముగించుకొని రాగానే ఆయనతో చర్చించి.. విధాన నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news