ట్రైన్ మిస్ అయ్యారా?..అయితే వెంటనే ఇలా చెయ్యండి..

-

దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ట్రైన్ జర్నీని ఇష్ట పడతారు.. ముందే రిజర్వేషన్ కూడా చేసుకుంటారు.. కొన్నిసార్లు ఎంత త్వరగా స్టేషన్ కు రావాలని అనుకున్న ట్రాఫిక్ వల్లో లేక ఇతర కారణాల వల్లో ఒక్కోసారి రైల్వే స్టేషన్‌కి సమయానికి చేరుకోలేకపోతాం. ఫలితంగా మనం ఎక్కవల్సిన ట్రైన్‌ మిస్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అనుభవమే ఇది. మరి అలాంటి పరిస్థితిలో అదే రైలు టికెట్‌పై మరో ట్రైన్ ఎక్కొచ్చా అనే సందేహం కలుగుతుంది. అయితే అందుకు ఇండియన్‌ రైల్వే కొన్ని నియమనిబంధనల్ని రూపొందించింది.

 

రైలు టికెట్లు బుక్ చేయడం, టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం, రీఫండ్ పొందడం వంటి విషయాలు అందులో పొందుపరిచారు. అలాగే ట్రైన్‌ మిస్ అయినప్పుడు అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించే అవకాశం ఉందో లేదో అనే విషయాన్ని కూడా టిక్కెట్ పై పేర్కొంది ఇండియన్ రైల్వే.. అయితే ముందుగా సీటు రిజర్వ్ చేసుకున్నట్లైతే తప్పనిసరిగా అదే ట్రైన్‌లో ప్రయాణించవల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్‌ మిస్‌ అయితే తర్వాత వచ్చే ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు లేదు. చార్ట్‌ ప్రిపేరైన తర్వాత క్యాన్సిల్‌ చేసుకున్నా.. ట్రైన్‌ మిస్‌ అయినా రిఫండ్‌ చేసుకోవడానికి అనర్హులు.

కాగా,పలానా సమయానికి వచ్చే ట్రైన్‌లో ప్రయాణించడానికి జనరల్ కంపార్ట్‌మెంట్‌ టికెట్ తీసుకుని, ఆ రైలులో ఎక్కలేకపోతే, తర్వాత వచ్చే మరో ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఐతే ఏ రోజైతే టికెట్‌ తీసుకున్నారో ఆ రోజుకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.. ఉదాహరణకు కడపకు ట్రైన్ బుక్ చేశారనుకోండి.. ఆ ట్రైన్ మిస్ అయ్యితే అదే ప్రాంతానికి వెళ్లే మరో ట్రైన్ లో జనరల్ లో వెళ్లొచ్చు..ఛార్టింగ్ స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన గంటలోగా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ తీసుకుంటే మీకు రీఫండ్ అమౌంట్ కూడా వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news