అన్నదాతలకు శుభవార్త… ఇలా చేస్తే రూ. 4 వేలు వస్తాయి…!

-

కేంద్రం అనేక రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. అయితే వాటిలో రైతుల కోసం కూడా స్కీమ్స్ వున్నాయి. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాని నిధి స్కీమ్ గురించి చెప్పుకునే తీరాలి. ఇప్పటికే ఎంతో మంది రైతులు ఈ స్కీమ్ వలన ప్రయోజనం పొందుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున జమ చేస్తోంది. ఇది ఇలా ఉంటే కేంద్రం ఏడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. అయితే త్వరలో ఎనిమిదో విడుత డబ్బులను జమ చేయనుంది.

చాల మంది రైతులు ఇంకా ఈ స్కీమ్ లో చేరకపోవడం తో ఈ డబ్బులని పొందలేకపోతున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే…? ఈ స్కీమ్ లో ఎప్పుడైనా చేరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చేరిన ఆలస్యం ఏమి లేదు. ఇప్పుడు చేరిన డబ్బులు అందుతాయి. జూన్ 30లోపు ఈ స్కీమ్ లో కనుక చేరితే వారికి రెండు ప్రయోజనాలు లభించనున్నాయి.

జూన్‌ లేదా జూలైలో 2 వేల రూపాయలను ఈ రైతులు పొందొచ్చు. ఈ పథకంలో చేరడానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లన్లోనే ఈ స్కీమ్ లో చేరడానికి సులువుగా అప్లై చేసుకోవచ్చు. https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news