రూ.250 తో అకౌంట్ తెరిస్తే.. ఒకేసారి రూ.15 లక్షలు పొందొచ్చు…!

-

ఎన్నో రకాల స్కీమ్స్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడం జరిగింది. వాటి వలన చాల లాభాలు ప్రజలకి కలుగుతాయి. అటువంటి స్కీమ్స్ లో సుకన్య సమృద్ది స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ వలన మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఈ స్కీమ్ లో కనుక పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లలు చేరితే మరెంత మేలు కలుగుతుంది. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ పథకం లో చేరే అవకాశం ఉంది. చాల మంది తల్లిదండ్రులు కూతురికి బంగారు భవిష్యత్ కానుకగా ఇవ్వాలని ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది.

కూతురి పేరుపై రూ.250 పెట్టి ఈ ఖాతా తెరవొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు. స్కీమ్‌ లో చేరిన ఏడాది నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉండాలి. 21 ఏళ్ల తర్వాత డబ్బులు తీసుకోవచ్చు. లేదా అవసరం అయితే 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

మెచ్యూరిటీ సమయంలో రూ.15 లక్షలకు పైగా రావాలంటే ప్రతి నెలా రూ.3 వేలు డిపాజిట్ చేస్తూ ఉండాలి. సుకన్య సమృద్ది పథకంపై 7.6 శాతం వడ్డీ వస్తోంది. దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి సుకన్య సమృద్ది పథకంలో చేరొచ్చు. తర్వాత ప్రతి నెలా కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news