ప్రజలు అటెన్షన్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్..!

-

నవంబర్ 1 నుండి సరికొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీనితో పలు అంశాలు కూడా మారబోతున్నాయి. నవంబర్ 1 రానే వచ్చింది. కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా అమలు కానున్నాయి. ఈరోజు నుండి పలు అంశాల్లో మార్పు. వీటివల్ల ప్రజలపై నేరుగా ఎఫెక్ట్ పడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు ఏఏ అంశాలు మారుతున్నాయో ముందే తెలుసుకుంటే మునుముందు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

మొదటిగా దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఆర్ఎల్ఎల్ఆర్‌ ను 7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఈ తగ్గింపు నిర్ణయం ఈరోజు నుంచే అమలు కానుంది. దీంతో హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ కస్టమర్లకు మంచి బెనిఫిట్ కలగనుంది.

మరో విషయం దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రైన్ల టైమ్ టేబుల్ ‌ను ఇండియన్ రైల్వేస్ మార్చేసింది. కొత్త టైమ్ టేబుల్ కూడా నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మూడవది ఈరోజు నుంచి తేజస్ ట్రైన్లు పట్టాలెక్కనున్నాయి. ఛండీగఢ్ నుంచి న్యూఢిల్లీ రూట్ ‌లో తేజాస్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ పరుగులు పెట్టనున్నాయి. మరొక విషయం కేరళ గవర్నమెంట్ కూరగాయలకు ధరలను నిర్ణయించింది. ఈ ధరలకు మించి కూరగాయలను విక్రయించకూడదు. ఇలా కూరగాయలకు రేట్లను నిర్ణయించిన తొలి రాష్ట్రంగా నిలిచింది కేరళ. నవంబర్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి రానుంది. వీటితో పాటు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌ కు సంబంధించిన రూల్స్ కూడా ఈరోజు నుంచి మారాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని కచ్చితంగా డెలివరీ బాయ్ ‌కు చెబితేనే సిలిండర్ డెలివరీ అవుతుంది లేదంటే మీకు గ్యాస్ సిలిండర్ లభించదు. అలాగే ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్‌ కూడా మార్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news