పీఎం కిసాన్ స్కీమ్ లో చేరితే రూ.6 వేలుతో పాటు మరెన్నో బెనిఫిట్స్…!

-

రైతుల కోసం కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ ని తీసుకు రావడం జరిగింది. అయితే ఈ స్కీమ్‌లో చేరితే రూ.6 వేలుతో పాటు మరెన్నో బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తీసుకు వచ్చారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. ఏడాదికి 3 విడతల్లో రూ.2 వేలు చొప్పున డబ్బులు అన్నదాతలకు లభిస్తున్నాయి.

ఇప్పటి దాక సర్కార్ 7 విడతల డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వచ్చే నెలలో 8వ విడత డబ్బులు కూడా అందించనున్నారు. అయితే కేవలం ఇవి మాత్రమే వస్తాయి అనుకుంటే పొరపాటు. మరి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే..? పీఎం కిసాన్ స్కీమ్ రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు KCC ( Kisan Credit Card) సులభంగా పొందొచ్చు. అయితే దీని ద్వారా రైతులకు చౌక వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 4 శాతం నుంచి ప్రారంభమౌతుంది.

అలానే సులభంగానే కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. దీని కోసం మీకు వచ్చే రూ.6 వేల నుంచే నెలవారీ డబ్బులు కట్టొచ్చు. అలానే కిసాన్ కార్డు కూడా మీరు పొందవచ్చు. దీనిని ద్వారా రైతులు అందరికీ ప్రత్యేకమైన ఫార్మర్ ఐడీ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ కార్డులతో రైతుల భూములను లింక్ చేయాలని భావిస్తోంది. కనుక ఇది ఉంటె నేరుగా రైతులకి ఏ స్కీమ్స్ వచ్చిన మంచి బెనిఫిట్ కలుగుతుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news