మారటోరియం ఎవరెవరికి వర్తిస్తుందంటే?

-

కరోనా నేపథ్యంలో లోన్‌ ఈఎంఐలు కట్టలేని వారి కోసం ఇటీవలే ఆర్బీఐ గవర్నర్‌ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మారటోరియం ఎవరెవరికి వర్తిస్తుందో తెలుసుకుందాం.

కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే వస్తున్నాయి. మందుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేలా కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌ డౌన్‌ ప్రకటించాయి. దీని ప్రభావం వ్యాపారుల మీద పడుతుంది, అలాగే ప్రజలు కూడా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాగే కొంత మంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతుండొచ్చు. అందుకే రిజర్వు బ్యాంక్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ మారటోరియం బెనిఫిట్‌ అందిస్తోంది. లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

ఈ లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ బెనిఫిట్‌ కింద రుణ గ్రహీతలు వారి లోన్‌ ను రీస్ట్రక్చర్‌ చేసుకోవచ్చు. ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే దీనికి బ్యాంక్‌ నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. అంటే మీరు లోన్‌ రీస్ట్రక్చర్‌కు అప్లై చేసుకోవాలి. లోన్‌ మారటోరియం కోసం మీరు సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ బ్యాంక్‌కు వెళ్లి రీస్ట్రక్చరింగ్‌ గురించి మాట్లాడుకొని అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకున్న 90 రోజుల్లోగా బ్యాంక్‌ మీ రీస్ట్రక్చరింగ్‌కు ఆమోదం తెలియజేస్తుంది.

మార్చి 31 నాటికి స్టాండర్డ్‌ రుణాలు కలిగిన వారికి ఈ మారటోరియం బెనిఫిట్‌ వర్తిస్తుంది. ఫస్ట టైమ్‌ మారటోరియం బెనిఫిట్‌ పొందిన వారు కూడా మళ్లీ మారటోరియం ప్రయోజనం పొందొచ్చు. మొదటి సారి మారటోరియం పొందని వారు ఇప్పుడు అవసరం అనుకుంటే లోన్‌ రీస్ట్రక్చరింగ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news