ఈ పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడి పెడితే కచ్చితంగా మంచి లాభం పొందుతారు?

-

పోస్టాఫీసులో ఎన్నో రకాల మంచి పథకాలు అమలవుతున్నాయి. వాటిలో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్. ఈ పథకం ద్వారా మనకు నెలవారీ ఆదాయం వస్తుంది. ఈ పథకంలో, మీరు ఒకే ఖాతాలో 9 లక్షల రూపాయల వరకు ఇంకా జాయింట్ ఖాతాలో 15 లక్షల రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ మొత్తం కూడా 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయబడుతుంది. మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందుతారు. ప్రస్తుతం దీనికి 7.4% వడ్డీ లభిస్తోంది.

5 లక్షల రూపాయల డిపాజిట్‌పై మీరు ఎంత సంపాదించవచ్చంటే.. మీరు ఈ పథకంలో కనుక 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే, 7.4 శాతం చొప్పున ప్రతి నెలా 3,083 రూపాయలు పొందవచ్చు.

7 లక్షల డిపాజిట్‌పై మీరు ఎంత సంపాదించవచ్చంటే.. రూ. 7 లక్షల డిపాజిట్ చేయడం ద్వారా, మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 4,317 పొందవచ్చు. మీరు 5 సంవత్సరాల తర్వాత కూడా మీ డబ్బుని కొనసాగించాలనుకుంటే, మీరు ఈ ఖాతాను మళ్లీ తెరవవచ్చు.

9 లక్షల డిపాజిట్‌పై మీరు ఎంత సంపాదించవచ్చంటే.. రూ.9 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా, మీరు ప్రతి నెలా రూ.5,550 వరకు సంపాదించవచ్చు.

12 లక్షల డిపాజిట్‌పై మీరు ఎంత సంపాదించవచ్చంటే.. ఇక ఈ స్కీంలో రూ. 12 లక్షలు డిపాజిట్ చేయడానికి, మీరు ఉమ్మడి ఖాతా కలిగి ఉండాలి.ఈ మొత్తంపై 7.4% వడ్డీ రేటుతో, మీరు ప్రతి నెలా రూ.7,400 పొందవచ్చు.

15 లక్షల డిపాజిట్‌పై మీరు ఎంత సంపాదించవచ్చంటే.. పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్‌లో జాయింట్ అకౌంట్‌లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే, మీరు ప్రతి నెలా రూ.9,250 దాకా సంపాదించవచ్చు. కాబట్టి ఇందులో కచ్చితంగా పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాలు పొందండి.

Read more RELATED
Recommended to you

Latest news