పెరిగిన బంగారం ధరలు… ఈరోజు ఎంతంటే..?

-

పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు నేడు పెరిగాయి. అయితే గత రెండు రోజుల నుండి అయితే బంగారం ధరలు పడిపోయాయి. కానీ నేడు మాత్రం పైకి కదిలింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పైకి కదిలింది.

ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరుగుదల నేపథ్యం లో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పైకి కదిలింది.

దీంతో రేటు రూ.49,960కు ఎగసింది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.110 పెరుగుదలతో రూ.45,810కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరిగింది. 0.32 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1911 డాలర్లకు చేరింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మోడైన వాటి ప్రభావం బంగారం మీద పడుతుందన్న సంగతి తెలిసినదే.

Read more RELATED
Recommended to you

Latest news