రాఫెల్ కుంభకోణంపై ఏఐసీసీ పిలుపు మేరకు విజయవాడలో కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలోకి ప్రదర్శనగా వెళ్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, తదితరులను పోలీసులు ఆంధ్ర రత్న భవనం వద్దే నిలువరించారు. నిరసనకు అనుమతి లేదంటూ వారిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రత్న భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రఘువీరారెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి భవానీపురం పోలీసుస్టేషన్కు తరలించారు. దేశంలోని వ్యవస్థలన్నీ మోడీ నాశనం చేస్తున్నారని రఘువీరా దుయ్యబట్టారు.
విజయవాడలో రఘువీరారెడ్డి అరెస్టు
By Anil Kumar
-
Previous article
Next article