బ్రేకింగ్ : ఏపీలో మరో ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్…!

-

killari roshaiah
killari roshaiah

ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది.. కరోనా కేసులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేవు. తెలుగు రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రులు ఇద్దరు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ మహమ్మారిని మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఎన్నో కఠిన నిబంధనలు పాటించే రాజకీయ నేతలను సెలబ్రిటీలను సైతం ఈ మహమ్మారి వదలడం లేదు. తెలంగాణ ఎమ్మెల్యే లను ఆంధ్ర ఎమ్మెల్యేలను సైతం ఈ మహమ్మారి కాటు వేసింది. తాజాగా నేడు ఏపీ లోని మరో ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఆయన కలెక్టరేట్‌లో ఓ సమావేశానికి హాజరు కాగా.. అదే మీటింగ్‌లో పాల్గొన్న హోంమంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీకి కరోనా సోకింది, ఇప్పుడు ఈ కొత్త కేసుతో ఆ సంఖ్య నలుగురు ఎమ్మెల్యేలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news