కూటమి మానిఫెస్టో అరచేతిలో వైకుంఠం చూపించింది పేర్ని నాని సెటైర్లు

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కావని బీజేపీకి అర్థమైపోయిందని ఆయన అన్నారు.అరచేతిలో వైకుంఠం చూపించారని పేర్ని నాని సెటైర్లు వేశారు. తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసిందని.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని పేర్ని నాని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదని మండిపడ్డారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారని ఆయన అన్నారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని.. ఇప్పుడెందుకు కలిశారని పేర్ని నాని ప్రశ్నించారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని ,మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్‌ నెరవేర్చారని పేర్ని నాని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news