దూబే పోస్ట్‌మార్టం రిపోర్టు : వెలుగులోకి సంచలన నిజాలు..!

-

ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన ఘటనలో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చింది. పోలీసుల ఎన్‌కౌంటర్ లో బుల్లెట్‌ గాయాలతో తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు షాక్‌కు గురై మరణించాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. ఆయన శరీరంపై పది గాయాలయ్యాయని, తొలి బుల్లెట్‌ దూబే కుడి భుజానికి, రెండు బుల్లెట్లు ఛాతీ ఎడమవైపు చొచ్చుకు వెళ్లాయని నివేదికలో తేలింది. యూపీ పోలీసులు ఈ నెల 10న దూబేను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న సమయంలో కారు బోల్తా పడింది.

ఇదే అదనుగా దూబే తప్పించుకునేందుకు యత్నించగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో అతడు చనిపోయాడు. కాగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో సీనియర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు ఇక్కడ తిరిగి సీన్ క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆ రోజున అక్కడే ఉన్న పలువురు పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది కూడా అక్కడ హాజరయ్యారు. తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news