ప్రభాస్-దీపిక కాంబినేషన్‌పై కీర్తి సురేష్..!

-

టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రంలో హీరోయిన్‌గా దీపికా పదుకొనే నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై దీపికా పదుకొనే స్పందిస్తూ.. “థ్రిల్లింగ్ మించి ఫీల్ అవుతున్నా.. అద్భుత‌మైన జర్నీని మొద‌లుపెట్టేందుకు ఆగ‌లేకున్నా” అని దీపిక సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. కాగా, తాజాగా.. ‘మహానటి’ కథానాయిక కీర్తి సురేష్ స్పందించింది.

‘బ్రహ్మాండమైన వార్త ఇది.. మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని సృష్టించడానికి ఓ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ జతకలిసింది..ఈ వెయింటింగ్‌ని భరించలేకున్నాను.. ‘ అంటూ కీర్తి సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికే కాగా కీర్తి సురేశ్ క్రీడా నేప‌థ్యంలో సాగే “గుడ్‌ల‌క్ స‌ఖి” చిత్రంలో న‌టిస్తున్నారు. మ‌రోవైపు ఆమె న‌టించిన మిస్ ఇండియా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news