గవర్నర్ మాకు అన్యాయం చేశారు… ఆత్మహత్యలే మాకు శరణం

-

రాష్ట్ర గవర్నర్​ తమను మోసం చేశారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్​ ఆమోదం తెలపడాన్ని వారు తప్పుబట్టారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు.

Amaravathi
Amaravathi

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటంపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ తమను మోసగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారంటూ ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వెంటనే వారంతా రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయాన్ని, న్యాయనిపుణుల సలహాలను తీసుకోకుండానే రాజ్యాంగ పదవిలో ఉండి ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news