జ‌గ‌న్ చుట్టూ ఉన్న క‌ట్ట‌ప్ప‌లెవ‌రు..?

-

గ‌త కొద్ది రోజులుగా వైసీపీకి, సీఎం జ‌గ‌న్‌కు కంట్లో నలుసులా మారిన ఆ పార్టీ అసంతృప్త నేత‌, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్‌ను, ప్ర‌భుత్వంలోని లోపాల‌ను, లొసుగుల‌ను తీవ్రంగా ఎత్తి చూపుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి ర‌ఘురామ జ‌గ‌న్ చుట్టే ఉండే క‌ప్ప‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ త‌న చుట్టూ ఉండే క‌ట్ట‌ప్ప‌ల‌ను గుర్తించాల‌ని.. లేనిప‌క్షంలో ప్ర‌మాద‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

జ‌గ‌న్ ఎప్పుడూ అవినీతిని ప్రోత్స‌హించ‌రు అన్న పేరుంద‌ని.. అయితే ఆయ‌న ప‌క్క‌నే ఉన్న కొంద‌రు క‌ట్ట‌ప్ప‌లు మాత్రం అవినీతిని ప్రోత్స‌హిస్తూ.. జ‌గ‌న్‌కు చెడ్డ పేరు తెస్తున్నార‌ని ర‌ఘుదుయ్య‌బ‌ట్టారు. ఈ క‌ట్ట‌ప్ప‌ల‌ను మీరు గుర్తించి ప‌క్క‌న పెట్ట‌క‌పోతే మీకు న‌ష్టం అని కూడా ర‌ఘురామ జ‌గ‌న్‌కు సూచ‌న‌లు చేశారు. బాహుబ‌లి సినిమాలో బాహుబలిని క‌ట్ట‌ప్ప పొడిచి చంపేశాడ‌ని.. అయితే అది సినిమా కాబ‌ట్టి స‌రిపోయింద‌ని.. మీ చుట్టూ ఉన్న క‌ట్ట‌ప్ప‌ల‌ను మాత్రం మీరే క‌నిపెట్టాల‌ని కూడా ర‌ఘురామ స‌ల‌హా ఇచ్చారు.

ఇక ఏపీ ప్ర‌జ‌లు మీపై చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని.. వారి ఆశ‌లు అడియాస‌లు కాకుండా ఉన్నాల‌న్నా.. వారి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టాల‌న్నా కూడా మీరు క‌ట్ట‌ప్ప‌ల‌ను ప‌ట్టుకుని వెంట‌నే శిక్షించాల‌ని కూడా ఆయ‌న చెప్పారు. కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ ప‌క్క‌నే ఉంటూ ప‌నికిరాని చెత్త మాట‌లు ఆయ‌న చెవితో ఊదుతూ.. వాళ్లు.. వీళ్ల‌పై చాడీలు చెపుతూ ప్ర‌జ‌ల‌ను నిలువెత్తు దోపిడీ చేస్తున్నార‌ని కూడా ర‌ఘురామ ఫైర్ అయ్యారు. ఏదేమైనా ర‌ఘురామ కృష్ణంరాజును వైసీపీ ప్ర‌భుత్వం అన‌వ‌స‌రంగా కెలికి వ‌దిలింద‌నే కామెంట్లు ప‌డుతున్నాయి.

ర‌ఘురామ‌పై వైసీపీ ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు చేయ‌డం… ప్ర‌త్యేకంగా ఢిల్లీ స్పెష‌ల్ ఫ్లైట్లో వెళ్లి మ‌రీ లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసి వ‌చ్చాక ఆయ‌న మ‌రింత‌గా రెచ్చిపోతూ పార్టీకి, ప్ర‌భుత్వానికి మ‌రింత ఇబ్బందిగా మారారు. మ‌రి ర‌ఘురామ చెపుతోన్న ఆ క‌ట్ట‌ప్ప‌లెవ‌రో ?  ఎవ‌రికి ఎ‌రుక ?

Read more RELATED
Recommended to you

Latest news