400రూపాయలకే స్మార్ట్ ఫోన్.. జియో సంచలనం..!

-

టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 50శాతం కంటే ఎక్కువ మార్కెట్ ని ఆక్రమించిన జియో నుండి తాజాగా స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి. గతంలో జియో మొబైల్స్ పేరుతో అతి తక్కువ ధరకే అందించిన జియో, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. ఇండియాలో లీడింగ్ లో ఉన్న చైనా కంపెనీలకి పోటీ ఇవ్వడానికి అన్నట్లు అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ తో మన ముందుకు రాబోతున్నారని సమాచారం.

ఈ మేరకు జియో సంస్థ లావా, కార్బన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుందని వినబడుతుంది. ఎక్కువ సంఖ్యలో స్మార్ట్ ఫోన్ సిద్ధం చేయండని ఆయా కంపెనీలని కోరినట్లు తెలుస్తుంది. చైనాతో ఘర్షణ వాతావరణం జరుగుతున్న వేళ ఇండియాలో తయారైన వస్తువుల పట్ల డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. అదీగాక ప్రభుత్వం కూడా చైనా వస్తువులపై ఒకలాంటి వ్యతిరేక భావం కనబరుస్తుంది. సో.. ఇలాంటి టైమ్ లో స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలోకి దిగనున్న జియో సంచలనాలు సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news