టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి దూరంగా లేము: డివిలియర్స్

-

నేడు ఐపీఎల్ 13 సీజన్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగబోతోంది. ఇకపోతే ఈ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అలాగే స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ తాజాగా స్పందించారు. నేడు జరగబోయే మ్యాచ్ తమ జట్టుకు ఎంతో కీలకమని బెంగళూరు బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ తెలిపారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో ఏబీ మాట్లాడుతూ ఈ సీజన్లో తమకు ప్రారంభం బాగానే జరిగిందని ఇదే క్రమంలో రెండు ఓటములు ఎదురైన కానీ మొత్తంగా మంచి ప్రదర్శన చేస్తున్నామని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి తాము దూరంగా లేము అని మంచి ప్రదర్శన కొనసాగించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తామని తెలిపారు. ఇక మ్యాచ్ విజయానికి, ఏం అంశాలు అవసరం అయితే అందుకు తగ్గట్టుగా ప్రదర్శన చేస్తామని తెలిపారు. మ్యాచ్ గెలవడానికి ఎలాంటి విషయంపై స్పష్టత ఉండాలో అవి తమకు తెలుసునని తెలిపాడు. ఇకపోతే తన బ్యాటింగ్ పరంగా ఇప్పటి వరకు బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్ల్ లో చివరి మ్యాచ్ తప్పించి మిగతా నాలుగు మ్యాచ్ల్లో బాగానే ఆడానని చెప్పుకొచ్చాడు. మళ్లీ తాను పరుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మిస్టర్ 360 తెలిపాడు.

ఇక ఆ వీడియోలో ఎబి డివిలియర్స్ తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ వారంలో మా జట్టు సభ్యులకు మంచి విశ్రాంతి దొరకడంతో బాగా ప్రాక్టీస్ చేశాము అని తెలిపాడు. ఈ సమయంలోనే తమ జట్టులో ఉన్న లోటుపాట్లను గుర్తించి దానిని సర్దుకున్నాం అని విరాట్ కోహ్లీ తెలియజేశాడు. రాబోయే మ్యాచుల్లో బాగా ఆడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news