నాడు నేడుపై ఏపీ కీలక నిర్ణయం…!

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది చాలా కీలకంగా ఉంది. వైద్య సేవలకు, విద్యకు చాలా మంచి ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుంది ఏపీ ప్రభుత్వం. సిఎం జగన్ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విపక్షాలు కూడా ఆరోపణలు చేయలేని కార్యక్రమం ఇది.

jagan
jagan

తాజాగా ఆస్పత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్ అధికారిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ విశ్రాంత అధికారి కె.ఎస్. సత్యనారాయణను నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. విద్యా రంగంలో ఎన్నో మార్పులకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news