నాడు ద్రౌపతి వస్త్రాపహరణం.. నేడు న్యాయదేవత వస్త్రాపహరణం..!?

-

జగన్ సర్కార్ నిర్ణయాలకు హైకోర్టులో ప్రతిసారి ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఇటీవల ఎవరూ ఊహించని విధంగా జగన్ సర్కారు న్యాయస్థానాల పై పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఇటీవల స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన నివాసంలో రచ్చబండ కార్యక్రమం లో మీడియాతో మాట్లాడిన రఘురామకృష్ణంరాజు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాష హత్యకు గురైతే న్యాయ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అప్పుడు కౌరవసభలో ద్రౌపతి వస్త్రాపహరణం జరిగితే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ సర్కార్ తీరుతో రాష్ట్రంలో న్యాయదేవత వస్త్రాపహరణం జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు రఘురామకృష్ణంరాజు. ఇక అలాంటి కౌరవసభలో తాను కూడా ఒక సభ్యున్ని అయినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వస్త్రాపహరణం కి గురైన ద్రౌపదిని గోవిందుడు కాపాడితే… నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్త్రాపహరణం కి గురవుతున్న న్యాయ దేవత ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాపాడుతారు అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

Read more RELATED
Recommended to you

Latest news