ముంబైతో మ్యాచ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సొట్ట బుగ్గల సుందరి…!

-

ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే వ్యక్తి బాలీవుడ్ హీరోయిన్‌ ప్రీతీ జింటా. కింగ్స్ పంజాబ్ సహ యజమానీ అయిన ఈ సొట్ట బుగ్గల సుందరీ మైదానంలో చేసే హడావుడి అంత ఇంత కాదు. తమ బ్యాట్స్‌మన్ సిక్స్ కొట్టినా.. ఫోర్ బాదినా.. కింగ్స్ పంజాబ్ బౌలర్ వికెట్ తీసినా గ్యాలరీలో గంతేస్తుంది. ముంబైతో జరిగిన డబుల్‌ సూపర్‌ ధమాకా మ్యాచ్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది ప్రీతి జింటా.

ఒక మ్యాచ్‌లో ఒక సూపర్ ఓవరే అభిమానులను టెన్షన్ పెడుతుంటుంది. అలాంటిది- ఒకే మ్యాచ్‌లో రెండు రెండు సూపర్ ఓవర్లు పడితే..అది హైఓల్టేజే అవుతుంది. అలాంటి మ్యాచ్‌లో సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది ప్రీతి జింటా. రెండు సూపర్ ఓవర్లు సాగినంత సేపూ ఉత్కంఠకు గురైన ప్రీతిజింటా.. తన జట్టు గెలిచే సరికి చిన్నపిల్లలా మారిపోయారు. వీఐపీ బాక్స్‌లో నుంచి మ్యాచ్‌ను చూస్తూ కనిపించిన ఆమె మయాంక్ అగర్వాల్ విన్నింగ్ షాట్ కొట్టగానే.. ఇక ఆగలేకపోయారు. అప్పటిదాకా నరాలు తెగే ఉత్కంఠతను అనుభవించిన సొట్ట బుగ్గల సుందరి.. విన్నింగ్ షాట్ తరువాత సూపర్‌ ఎంజాయ్‌ చేసింది.

మ్యాచ్‌ తర్వాత కూడా ప్రీతి జింటా తన జట్టు సభ్యులతో కలిసి ఎంజాయ్‌ చేసింది. విజయానందంలో కేక్‌ కేట్‌ సంబరాలు చేసుకున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు విజయం కోసం చివరి దాకా పోరాడుతోంది. దీంతో మ్యాచ్‌లను చివరి వరకు తెచ్చి ప్రేక్షకులకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించకండని.. ప్రీతి ట్విట్టర్ వేదికగా తమ జట్టును కోరారు. మొత్తానికి పంజాబ్ విక్టరీ కన్నా ప్రీతి జింటానే ఈ మ్యాచ్‌లో ఫోకస్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news