ఇంటింటికీ పది వేల ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్

-

హైదరాబాద్ ని భారీ వర్షాలు అతలా కుతలం చేస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికి 80 కాలనీలు ఇంకా వరదలో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే కేసీఆర్ సర్కార్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం ఓ కీలక ప్రకటన చేసింది.

హైదరాబాద్ లో వర్షాలు వరదలు ద్వారా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి ₹ 10,000 ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం. అలానే వరదల్లో ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తులకి ₹ 1 లక్షల ఇవాలని మరియు పాక్షికంగా దెబ్బతిన్న వారి గృహాలకు ₹ 50, 000 అంద చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇక తెలంగాణ కేంద్రం సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పలనిస్వామి పది కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news