బిగ్ బ్రేకింగ్ : వ్యంగ్యంగా..రిటైర్మెంట్ ప్రకటించిన పీవీ సింధు

-

ఇండియన్ బ్యాడ్మింటన్ ఫ్యాన్స్ కి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు షాక్ ఇచ్చింది. ఆమె ఏకంగా తన కెరీర్ కు రిటైర్‌మెంట్‌ ప్రకటించినట్టు ప్రకటించింది. అయితే ఆమె తన కెరీర్ కి కాదు తనలో ఉన్న నేగిటివిటీకి, అన్ రెస్ట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తన ట్విట్టర్ ద్వారా సింధూ ప్రకటించింది. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని సింధూ ట్వీట్ చేసింది. ఈ కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారిందన్న ఆమె నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్నని పేర్కొంది.

ప్రత్యర్థిని గెలవడానికి చివరి వరకు పోరాడేదాన్నని, ఇంతకు ముందు అలానే చేశాను, ఇకపై కూడా చేయగలనని అంది. అయితే కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను ? అని ఆమె ప్రశ్నించింది. నెలలు గడుస్తున్నా, బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నామన్న ఆమె విశ్రాంతి లేని ఈ ఆటకు స్వప్తి పలకాలని నిశ్చయించుకున్నాననని పేర్కొంది. నెగిటివిటీ, భయం, అనిశ్చితినుంచి రిటైర్‌ అవ్వబోతున్నానని ఆమె పేర్కొంది. మనం మరింత సంసిద్ధంగా ఉండాలని, కలిసి కట్టుగా వైరస్‌ను ఓడించాలని ఆమె పేర్కొంది. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని వారిని ఓడిపోనివ్వకుండా చూడాలని ఆమె సుదీర్ఘంగా రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news