ముంబై విజయం వెనుక వినాయకుడు ఉన్నాడా…?

-

ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతుంది. లీగ్ దశలో కాస్త ఇబ్బంది పడినా సరే ఆ తర్వాత తన సత్తా చూపించింది. యువ ఆటగాళ్ళు, సీనియర్ ఆటగాళ్ళు కూడా సమిష్టిగా సత్తా చాటడంతో ఐపిఎల్ లో ముంబై వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ముంబై జట్టు ఫైనల్ కి చేరుకుంది. నిన్న జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించి ఫైనల్ కి వెళ్ళింది ముంబై జట్టు.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది ముంబై. అయితే ముంబై విజయానికి ఒక సక్సెస్ ఉంటుంది అంటున్నారు అభిమానులు. డ్రెస్సింగ్ రూమ్ లో… అంటే మైదానం బయట టీం సిబ్బంది కూర్చునే సమయంలో వినాయకుడి ఫోటోతో పాటుగా లక్ష్మీ దేవి ఫోటో కూడా పెట్టుకుంటారట. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news