టాలీవుడ్ లో డస్కీ బ్యూటీస్ కు డిమాండ్ పెరిగిందా..?

-

టాలీవుడ్ లో పింక్ బ్యూటీస్ కే కాదు..డస్కీ బ్యూటీస్ కు వాల్యూ పెరుగుతుంది.ఒకప్పటిలా పర్ ఫార్మెన్స్ పాత్రలకే కాకుండా గ్లామర్ డాల్స్ గా డస్కీ బ్యూటీస్ ను నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీంతో వెండితెరపై గ్లామర్ డెఫినిషన్ మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుకోవచ్చు.

సౌత్ సినీ పరిశ్రమలో డస్కీ బ్యూటీస్ కు ముందునుంచి కోలీవుడ్ ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంది.ఎటొచ్చి మనమూ,శాండిల్ ఉడ్ ఈ విషయంలో బాగా వెనకడిపోయాం అనిపిస్తుంటుంది.తాజాగా టాలీవుడ్లో కూడా డస్కీ బ్యూటీస్ కు వాల్యూ ఇస్తున్నారు.ఏదో సైడ్ రోల్స్ తో సరిపెట్టకుండా మాంచి పసందైన పాత్రలకనే ఫిల్ చేస్తున్నారు.రీసెంట్ గా వస్తున్న సినిమాలలో డస్కీ గాళ్స్ కు దక్కుతోన్న అవకాశాలు చూస్తే ఈ విషయం కన్ఫామ్ అవుతుంది.

ఈషా రెబ్బ లాంటి బ్యూటీస్ కు టాలీవుడ్ ఆవిధంగానే ఛాన్స్ లు ఇచ్చింది.కాకపోతే ఆమెకు లక్ కలిసిరాకపోవడంతో నోటెడ్ హీరోయిన్ కాలేకపోయింది.ప్రియమణి పరిస్థితి ఇంతే.చాలా తక్కువ టైమ్లోనే అమ్మడు ఫేడ్ అవుట్ అయింది.ఈ మధ్యకాలంలో డస్కీ బ్యూటీగా పాపులర్ అయిన ఐశ్వర్యరాజేష్ కోలీవుడ్లో వరుస ఆఫర్లు చేజిక్కించుకుంటూ దూసుకుపోతుంది.తెలుగులో ఈ అమ్మడు రౌడీస్టార్ తో వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా తెలుగులో అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు డస్కీ బ్యూటీ రిక్రూట్ అయినట్లుగా తెలుస్తుంది.అలా రిక్రూట్ అయిన బ్యూటీ మరోవరో కాదు..నివేతా పేతురాజ్ . మెంటల్ మదిలో ,అల వైకుంటపురములో సినిమాలలో అదరగొట్టిన ఈసుందరిని సితార ఎంటర్ టైన్ మెంట్ మరోఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లుగా తెలుస్తుంది.మెంటల్ మదిలో చోటా హీరోతోను,అలవైకుంటపురములో జస్ట్ సైడ్ హీరోయిన్ గా చేసిన ఈ హస్కీబ్యూటీ …అయ్యప్పనుమ్ తో పెద్ద హీరోకు మెయిన్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది.ఒకవేల ఇది వర్కవుట్ అయితే తెలుగులో మరింతమంది డస్కీబ్యూటీలకు డిమాండ్ పెరుగుతుందనుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news