జగన్ ను అంబేద్కర్ తో పోల్చిన మహిళ ఎమ్మెల్యే..!

-

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అనే విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అయితే ఇటీవలే అసెంబ్లీ వేదికగా మాట్లాడిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే జగన్ ప్రభుత్వం ఎస్టీ కులాల వారి విషయంలో వ్యవహరిస్తున్న తీరు పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినవ అంబేద్కర్గా అభివర్ణించారు వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్.

ఇటీవలే అసెంబ్లీ వేదికగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా జగన్ ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించగా.. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉషశ్రీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు… ఓవైపు బీసీలకు సముచిత స్థానం కల్పిస్తూ మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు న్యాయం జరిగే విధంగా 50 శాతం రిజర్వేషన్ కల్పించి.. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినవ అంబేద్కర్ గా మారారు అంటూ ఆమె ప్రశంసించారు. ఆనాడు అంబేద్కర్ కలలు కన్న ఆశయాలని నేడు జగన్ అమలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news