బ్రేకింగ్: హైదరాబాద్ మేయర్ ని ఎంపిక చేసిన కేసీఆర్

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని తెరాస కైవసం చేసుకుంది. తెరాస పార్టీకి ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోయినా సరే ఆ పార్టీ మాత్రం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎక్స్ అఫీషియో ఓట్లతో ఆ పార్టీ మేయర్ స్థానం కైవసం చేసుకుంది. ఇక హైదరాబాద్ మేయర్ ని సిఎం కేసీఆర్ ఎంపిక చేసారు. సింధు ఆదర్శ్ రెడ్డిని మేయర్ గా సిఎం కేసీఆర్ ఎంపిక చేసారు.

ప్రగతి భవన్ కి రావాలని ఆమెకు సిఎం ఫోన్ చేసారు. భారతీ నగర్ నుంచి ఆమె రెండో సారి కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఇక డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దిన్ ని ఎంపిక చేసారు. ఆయన బొరబండ నుంచి రెండు సార్లు వరుసగా విజయం సాధించారు. హైదరాబాద్ మేయర్ పీఠం ఓసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news