అవంతి చూపు వైసీపీ వైపు!

-


తెదేపా ఎంపీ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. దీనికి సంబంధించిన పోస్టులు, వార్తలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొట్టాయి. అధికార పార్టీలో ఉన్న ఎంపీ ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లబోతున్నారనే ప్రచారంతో కలకలంరేగింది. దీంతో విషయం తెలుసుకున్న అవంతి తేరుకుని తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను వైసీపీలో చేరబోతున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని అవంతి ఆరోపించారు.

దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని భావిస్తున్నానని.. పార్లమెంట్ సమావేశాల ఉండటంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారనిమండిపడ్డారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. తెదేపా ఎంపీగా తాను పార్లమెంట్‌లో విభజన హామీల అమలు కోసం పోరాడానని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news