పెళ్లికి ముందు రోజే రోడ్ ప్రమాదంలో వరుడు మృతి..ప్రమాదమా ? హత్యా ?

-

రేపు పెళ్లి ఉందనగా పెళ్లి కొడుకు చనిపోయిన ఘటనా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పని పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్(25) అనే యువకుడు రోడ్ ప్రమాదంలో అక్కడికి అక్కడే మృతిచెందాడు. మృతుని పెళ్లి జరగాల్సిన రోజుకు ముందే మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. కోయగూడెం గ్రామానికి చెందిన యువతితో నిన్న శ్రీనివాస్ పెళ్లి జరగాల్సి ఉండగా మొన్న రాత్రి పెళ్లికి కావాల్సిన సామానుల కొనుగోలు కోసం అబ్బాయి కుటుంబంతో కలిసి కొత్తగూడెం వెళ్లి సామానులు తీసుకుని ఇంటికి వస్తున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ముందు ఆటోలో ఇంటికి చేరుకున్నారు.

కొంచెం పని ఉంది అని ఆగిన శ్రీనివాస్ ఒక్కడే ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న క్రమంలో తలకి గాయంతో రోడ్ పై పడి ఉన్నాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు 9 గంటల సమయంలో శ్రీనివాస్ రోడ్ ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబీకులకు సమాచారం అందించారు. దీనితో హుటాహుటిన అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఇది రోడ్ ప్రమాదం కాదని ఖచ్చితంగా హత్యేనని ఎవరో చంపి ఇక్కడ పడేశారని ఆరోపిస్తున్నారు. హెల్మెట్ ధరించిన శ్రీనివాస్ తలకు అంత పెద్ద గాయం ఎలా అవుతుంది అని, బైక్ కు ఎలాంటి డామేజ్ జరగలేదని ఇది కచ్చితంగా హత్యే అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అసలు ఏమయింది అనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news